Mane Praveen

Sep 25 2023, 17:25

IBP: పలువురికి నియామకపు పత్రాలు అందజేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని,  ఇబ్రహీంపట్నం మండల ఓబీసీ సెల్ చైర్మన్ గా పసుల వినోద్ కుమార్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఓబీసీ సెల్ చైర్మన్ గా పండాల శ్రీనివాస్ గౌడ్ నియమితులు అయ్యారు, వారికీ టిపిసిసి వైస్ ప్రెసిడెంట్  మల్ రెడ్డి రంగారెడ్డి సోమవారం నియామకపు పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఓబీసీ సెల్ చైర్మన్ సుబ్బురు పాండు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎదుళ్ల పాండు రంగారెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌని బాలరాజ్ గౌడ్, ఆకుల ఆనంద్ కుమార్, కౌన్సిలర్ ఆకుల మమత, సీనియర్ నాయకుడు మంకాల శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మంకాల కరుణాకర్, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్, సంతోష్, కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS RR DIST

SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP

Mane Praveen

Sep 25 2023, 17:01

నల్లగొండ కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టర్ ఆఫీస్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 20 తేదీ నుండి నిరవధిక సమ్మె కొనసాగుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవరిస్తుందని ఆరోపించారు. 2001 సంవత్సరం లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ఆనాటి ప్రభుత్వం నేటి వరకు విజయవంతంగా కొనసాగుతుంది. కానీ మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు మాత్రం తొలిగిపోలేదు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స్వయంగా 3000 రూపాయలు ఇస్తామని ప్రకటించి జీవో విడుదల చేసినా, నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. గత ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల కార్మికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అప్పులు చేసి వంట చేస్తే, o కార్మికులకు బిల్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేకుండా ప్రకటన చేస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పంట కార్మికులకు ఇచ్చే వేతనంతో పాటు కమిషన్ పెంచాలని ఆయన కోరారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించి నెలకు 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అకారణంగా వంట కార్మికులను తొలగించరాదని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు అకారణంగా మరణిస్తే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే వంట సామాను, సంబంధించిన సామాగ్రిని సరఫరా చేయాలి. కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న వేతనాలను ప్రభుత్వం వంట కార్మికుల గౌరవ వేతనం 3000 తక్షణమే నిధులను విడుదల చేయాలని కోరారు. ధర్నా అనంతరం అడిషనల్ కలక్టర్ కు మెమొరాండం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జే జంగమ్మ, కార్యదర్శి బంటు రాజేశ్వరి, జిల్లా కౌన్సిల్ సభ్యులు జే వెంకట రాములు, ఏ మల్లయ్య, సైదులు, లక్ష్మయ్య, శేఖర చారి, సైదమ్మ, వెంకటమ్మ, సాలమ్మ, అలివేలు, విజయ, మల్లమ్మ, నారమ్మ, ఫాతిమా, లక్ష్మి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Sep 25 2023, 15:55

NLG: మెడికల్ కాలేజీ కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించండి: జిల్లా కలెక్టర్ కు మెమొరాండం
నల్లగొండ: మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇప్పించాలని, కొత్త టెండర్ వెంటనే పూర్తి చేయాలని, మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం AITUC ఆధ్వర్యంలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు జిల్లా కలెక్టర్ కు మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజిలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలల దాటిపోయినా నేటికీ వేతనాలు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని అన్నారు. జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి, మరియు జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని దేవేందర్ రెడ్డి కోరారు. ప్రిన్సిపాల్, కాంట్రాక్టర్ ఇద్దరి మధ్య లో కార్మికులు నలిగిపోతున్నారని అన్నారు. టెండర్ నోటిఫికేషన్ వేసి 10 నెలలు దాటి పోతున్నా, నేటి వరకు పూర్తి చేయకుండా కాలేజీ యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని తెలిపారు. రాష్ట్రం మొత్తం హాస్పిటల్ కార్మికుల వేతనాలు పెరిగినా,నల్లగొండ మెడికల్ కాలేజీలో పనిచేసే కార్మికులకు మాత్రం నేటికీ పాత జీతాలే ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో AITUC మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం. డి జకీర్, అండాలు, చెంద్రమ్మ, స్వర్ణ, విజయ, రేణుక, కవిత, చంద్రమ్మ, కోటేశ్వరి, సీత, లక్ష్మి, శిల్ప, జమీర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA

STREETBUZZ NEWS APP

Mane Praveen

Sep 25 2023, 14:56

మద్దూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నారాయణపేట ఎస్పీ


TS: నారాయణ్ పేట ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, ఆకస్మికంగా మద్దూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా ఉంటూ, వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని.. ప్రజలకు మంచి సేవలు అందించాలని పోలీస్ అధికారులకు సూచించారు.SB NEWS SB NEWS NARAYANPETSB NEWS TELANGANA STREETBUZZ NEWS NATIONAL NEWS APP

Mane Praveen

Sep 25 2023, 14:17

NLG: ప్రారంభమైన ఆశాల నిరవధిక సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో ఆశా వర్కర్ ల నిరవధిక సమ్మె  సోమవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు నిర్ణయించాలని,  రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్స్ ను పరిష్కరించాలని కోరుతూ.. రాష్ట్రంలో అనేక పోరాటాలు నిర్వహించాము, గతంలో 106 రోజులు సమ్మె చేశారు. కలెక్టరేట్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ల ముందు అనేకసార్లు ధర్నాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు కూడా నిర్వహించారు. ఇంకా అనేక రూపాల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఇటీవల సెప్టెంబర్ 11న కోఠి, హైదరాబాద్ హెల్త్ కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశాలతో ధర్నా నిర్వహించి, అదే రోజు హెల్త్ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనేక సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో నేటికీ ఫిక్స్డ్ వేతనం నిర్ణయం జరగకపోవడంతో.. ఆశా వర్కర్ లు తీవ్రమైన ఆందోళన గురి అవుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్ప మార్గం లేదని సెప్టెంబర్ 25 నుండి రాష్ట్రంలో అన్ని పిహెచ్సి సెంటర్లో ఆశా వర్కర్లు సమ్మెకు దిగారు.  వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో గత 32 సంవత్సరాలు మైదాన ప్రాంతంలో 18 సంవత్సరాల నుండి ఆశా వర్కర్లకు రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వీరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏర్పుల యాదయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, భీమనపల్లి అరుణ, పందుల పద్మ, కాలం సుజాత బుసిరెడ్డి, ధనమ్మ, మెండు విజయమ్మ,కొయ్య మంజులమ్మ, ఎస్కే సైదా బేగం, ఆయిల్ల కలమ్మ, కే.సునీత, పల్లె కౌసల్య, ఐతరాజు సునీత, లపంగి తబిత,  లపంగి దుర్గమ్మ, పొగాకు అలివేలుమంగ, బోయపల్లి యాదమ్మ, దేశగోని మంజుల, రోజా, తదితరులు సమ్మెలో పాల్గొన్నారు
SB NEWS NALGONDA

SB NEWS TELANGANA


Mane Praveen

Sep 25 2023, 10:19

ప్రపంచంలోనే జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం అంబేద్కర్: రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రజిని సాయిచంద్

నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం సరంపేట గర్షగడ్డ గ్రామంలో, ఆదివారం నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద రజిని సాయి చంద్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, తదితరులు  హాజరై అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసి అనంతరం  ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద రజిని సాయి చంద్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభను జ్ఞాన సభ అని, ప్రపంచంలో జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం ఎవరు అంటే? అది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని చెప్పవచ్చని ఆమె మహనీయుడు అంబేద్కర్ ను కొనియాడారు.
కార్యక్రమంలో  పలువురు నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
SB NEWSSB NEWS NALGONDASTREETBUZZ NEWS NALGONDASTREETBUZZ NEWS TELANGANASB NEWS NATIONAL NEWS APP

Mane Praveen

Sep 24 2023, 19:17

గర్షగడ్డ: అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, సరంపేట గర్షగడ్డ గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మునుగోడు నియోజకవర్గ  ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద రజిని సాయి చంద్, దలితబంధు జిల్లా డైరెక్టర్ లపంగి నరసింహ, మాల్ మార్కెట్ మాజీ చైర్మన్ దంటు జగన్, వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోటకూర శంకర్, గ్రామ సర్పంచ్ వెన్నేమల్ల వెంకటమ్మ మధుకర్, రైతుబంధు మండల కన్వీనర్ రామకృష్ణ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, జాతీయ అధికార ప్రతినిధి బెరే గురుపాదం, రాష్ట్ర అధ్యక్షుడు చిక్కుడు గుండాల, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, మాల మహానాడు మండల అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య తదితరులు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించుకుంటున్నామని, అందులో భాగంగా బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి తోడ్పడే విధంగా గురుకుల పాఠశాల, కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామని, అందులో ఒక్కొక్క విద్యార్థికి ఒక లక్ష 25 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఆసరా పెన్షన్, వికలాంగుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లు అందజేస్తున్నామని, అంబేద్కర్ ఆశయాలు సాధించుకునే విధంగా అన్ని వర్గాలకు మేలు జరిగే పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు వెన్నేమల్ల నరసింహ, వెన్నమల్ల వెంకటేష్, మంచాల యాదగిరి, పోతురాజు ప్రకాష్, ఈసం కమలాకర్, గిరిసామెల్, మంచాల అంజయ్య, మంచాల సతీష్, ఇతర గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA

SB NEWS TELANGANA

Mane Praveen

Sep 24 2023, 11:46

TS: కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
కరీంనగర్ జిల్లా: ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొని నలుగురికి తీవ్ర గాయలైన ఘటన శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ శివారులోని ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 46 మంది ప్రయాణికులతో నిజామాబాద్ కు వెళ్తుంది. ఈ క్రమంలో బస్సు తాడికల్ శివారులోకి రాగానే కరీంనగర్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో 16 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలిలంచారు. విషయం తెలుసుకున్న కేశవపట్నం ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకు వివరాలను సేకరిస్తున్నారు... SB NEWS SB NEWS TELANGANA

STREETBUZZ APP

Mane Praveen

Sep 23 2023, 15:36

TS: గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వినాయక చతుర్థిని పురస్కరించుకుని హాస్టల్ గదిలో వినాయకుడి ని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజ లో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా ఉడడం కోసం చుట్టూ దుప్పట్ల తో తెర ఏర్పాటు చేశారు. గాలికి దుప్పటి కి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులకు గాయాలైనాయి. SB NEWS SB NEWS HYDERABAD SB NEWS TELANGANA

Mane Praveen

Sep 23 2023, 15:12

చౌటుప్పల్: అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు

YBD: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరియు నాగుల గుంట పక్కన ఉన్న శివాలయంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, ఆయన చేతుల మీదుగా భక్తులకు అన్నం వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కామిశేట్టి భాస్కర్, నాంపల్లి శ్రీనివాస్, కామిశెట్టి చంద్రశేఖర్, సోమారపు సత్తయ్య, కటకం ప్రశాంత్, నాంపల్లి రమేష్, జొర్రిగల వెంకటేష్ సరిత, సంధగళ్ల మల్లేష్, చిలువేరు శ్రీశైలం, వీరమల్ల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS YADADRI DIST SB NEWS TELANGANA